వాస్తవం ప్రతినిధి: కాశ్మీర్ వ్యవహారంలో పాకిస్థాన్ మరోసారి తలదూర్చి తన అక్కసు వెళ్ళగక్కింది. కాశ్మీర్ లో అణచివేత చర్యలకు పాల్పడుతుంది అంటూ భారత్ పై ఆరోపణలను గుప్పించింది. పాక్ ప్రధాని షాహిద్ ఖక్కన్ అబ్బాసీ స్వయంగా ఆ ఆరోపణలకు దిగటం విశేషం. గురివింద గింజ తన కింద ఉన్న నలుపును చూడకుండా ఎదుటి వాటి నలుపు గురించి చెబుతుందట. సరిగ్గా పాక్ కూడా అలానే వ్యవహరిస్తుంది. సరిహద్దు లో నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘిస్తూ కాల్పులు జరిపి ఎందఱో సరిహద్దు ప్రజల ప్రాణాలను బలిగొంటున్న పాక్ ఇప్పుడు కాశ్మీరు ప్రజలతో భారత సైన్యం దారుణంగా వ్యవహరిస్తోంది అని వ్యాఖ్యానించింది. వారిని మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదని, అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటోంది అంటూ ఎదురు దాడికి దిగింది. అంతటితో ఆగకుండా ధర్నాలు, ఆందోళన చేపట్టే వారిపై పెల్లెట్ గన్లను ప్రయోగిస్తూ అణచివేత ధోరణిని ప్రదర్శిస్తోంది. స్వేచ్ఛ కోసం పోరాడే వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేస్తోంది అని పేర్కొంటూ అబ్బాసీ ఓ ప్రకటన విడుదల చేయడం విశేషం. కావున అంతర్జాతీయ సమాజం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరిన ఆయన, నిజనిర్ధారణ కమిటీ ద్వారా కాశ్మీర్లోని పరిస్థితులపై అధ్యయనం చేపట్టాలని ఐకరాజ్యసమితిని కోరినట్లు తెలుస్తుంది. ఆదివారం వరుస ఎన్కౌంటర్లలో 13 మంది మిలిటెంట్లు హతమైన సంగతి తెలిసిందే. దీనితో దక్షిణ కాశ్మీర్ లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల తీవ్రవాదుల్ని మట్టుబెట్టడం తో నిరసన కారులు పోలీసుల మీదకు రాళ్లు రువ్వడం తో బలగాలు వారిపై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా,పలువురు గాయపడినట్లు తెలుస్తుంది. అయితే ఈ పరిణామాల అనంతరం పాక్ ప్రధాని అబ్బాసీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
మెక్రాన్ తో సన్నిహితంగా ఉన్న ట్రంప్
వాస్తవం ప్రతినిధి: ఎవరితోనూ అంతగా సన్నిహితంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్తో మాత్రం చాలా సాన్నిహిత్యంగా ఉన్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన మెక్రాన్ మంగళవారం...
టొరంటో ఘటనలో 10 కి చేరిన మృతుల సంఖ్య
వాస్తవం ప్రతినిధి: కెనడా రాజధాని టొరంటో నగరంలో పాదచారులపైకి ట్రక్కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 10 కి చేరింది. ఒక హైస్కూల్ కార్యక్రమానికి...
మిషా కి లీగల్ నోటీసులు పంపిన అలీ జాఫర్
వాస్తవం ప్రతినిధి: పాకిస్థానీ నటి మిషా షఫీ ఇటీవల పాక్ కి చెందిన గాయకుడు, నటుడు ఆలీ జఫర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పాక్లో కలకలం...
హెచ్1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు త్వరలో వర్క్ పర్మిట్ నిరాకరణ!
వాస్తవం ప్రతినిధి: అమెరికాలో హెచ్ 1బీ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉండగా, త్వరలో దీనికి ముగింపు పలకాలని అమెరికా సర్కారు యోచిస్తోంది. చట్టబద్ధంగా...
జనసేన హ్యూస్టన్ సంఘీభావం మరియు సైలెంట్ ప్రొటెస్ట్
వాస్తవం ప్రతినిధి: హ్యూస్టన్ మహానగరంలో "రే మిల్లర్ పార్కులో - ( రవింద్ర నాధ్ టాగూర్ పార్క్)" జనసేన కార్యకర్తలు రాజేష్ యాళ్ళబండి ఆధ్వర్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి తమ సంఘీభావం...
యుకె, సింగపూర్ మరియు దుబాయ్ లలో జనసేన కార్యకర్తల నిరసనలు
వాస్తవం ప్రతినిధి: తన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్న మీడియా సంస్థల ను బహిష్కరించాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిరోజులుగా ట్విట్టర్ ద్వారా వరుస ట్వీట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్...
ధోనీ,కోహ్లీ ల మధ్య పోరు!
వాస్తవం ప్రతినిధి: ఐపీఎల్-11 సీజనులో ఆసక్తికర పోరుకు బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం సర్వం సన్నద్ధమైంది. అటు మైదానం లో, ఇటు బయట కూడా ఎంతో స్నేహంగా ఉండే ధోనీ,కోహ్లీ ల మధ్య పోరు జరగనుంది. ధోనీ...
వాంఖడే మైదానం లో కేక్ కట్ చేసిన మాస్టర్ బ్లాస్టర్
వాస్తవం ప్రతినిధి: వాంఖడే మైదానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ తన 45వ జన్మదిన వేడుకలను మంగళవారం జరుపుకొన్నాడు. ఐపీఎల్లో భాగంగా మంగళవారం ముంబయిలోని వాంఖడే మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ - ముంబయి ఇండియన్స్...
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గంభీర్
వాస్తవం ప్రతినిధి: ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ సారథి గౌతమ్ గంభీర్ తాజాగా ఆ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గతంలో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు సారద్యం వహించిన గంభీర్ రెండు సార్లు ఐపీ...